_దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలు
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయాలని, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరువు మండల పరిధిలోని పోచారం గ్రామంలో ఏర్పాటు చేసిన రామాలయం గుడి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం బచ్చుగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన బీరప్ప దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, గ్రామ సర్పంచులు జగన్, సుమతి రామచందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, బిక్ష పతి, కోడూరు బిక్షపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…