Telangana

లారీ ప్రమాదంలో మృతి చెందిన పాత్రికేయుడు

_శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యుల నివాళులు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాత్రికేయుడు మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా, బచ్చన్న పేట మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య చిన్న కుమారుడు బొడికే శ్రీనివాస్ (45) శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ ప్రస్థానం అనే దినపత్రికలో గత ఆరు ఏడు సంవత్సరాలుగా విలేకరిగా పనిచేస్తున్నాడు. బొడికే శ్రీనివాస్ అనే పాత్రికేయుడు గత రెండు రోజుల క్రితం పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని జిన్నారం గ్రామంలో ఓ బార్ట్4 డే పార్టీకి శ్రీనివాస్ భార్య ఇందిరా, ఆయన కుమారుడు నందకుమార్ (8) మరియు ఆయన స్నేహితుడు రమేష్ (34) వాళ్ళ భార్య సంధ్య (28) అతని ముగ్గురు పిల్లలు కలిసి మధ్యాహ్నం వెళ్లి తిరిగి వచ్చి క్రమంలో సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్, రమేష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చుట్టుపక్కల వారు 108 వాహనం లో పటాన్ చెర్ లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి కి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని మృతులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ క్లబ్ తరఫున ఆయన కుటుంబానికి తాము అండగా నిలబడతామని ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. తోటి పాత్రికేయూన్ని ఇలా ప్రమాదవశాత్తు కోల్పోవడం చాలా దురదృష్టకరమని, ఇంతకు ముందు కూడా అనేకమంది పాతికేయ సోదరులు తమ వృత్తిలో భాగంగా వివిధ కారణాలతో చనిపోవడం జరిగిందని, వారందరికీ కూడా తమ సానుభూతిని తెలుపుతున్నట్టు సభ్యులు తెలిపారు. ఈయన కుటుంబాన్నీ ఆదుకోవడానికి ప్రభుత్వంతో మాట్లాడి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ గ్రామమైన నాగిరెడ్డిపల్లి లో అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago