Telangana

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు.ఆదివారం పటాన్ చెరు పట్టణంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం లేదని,వికలాంగుల సంక్షేమం, నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పారు.

గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు .జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న జీవో నెం 34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను కొత్తగా నియమించడం జరిగిందని, వికలాంగుల సంక్షేమ శాఖను అవసరమైన ఉద్యోగులను నియమించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేయ లేదన్నారు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గత ప్రభుత్వ హయాంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, పోరాటాలకు తలోగ్గి తెరాస ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం 34 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago