Telangana

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి

ఈనెల10న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని ఎన్ పిఆర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి మేరీ, డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు.ఆదివారం పటాన్ చెరు పట్టణంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం లేదని,వికలాంగుల సంక్షేమం, నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసినట్లు చెప్పారు.

గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు .జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న జీవో నెం 34 అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను కొత్తగా నియమించడం జరిగిందని, వికలాంగుల సంక్షేమ శాఖను అవసరమైన ఉద్యోగులను నియమించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేయ లేదన్నారు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గత ప్రభుత్వ హయాంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందని, పోరాటాలకు తలోగ్గి తెరాస ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు .రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం 34 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago