పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కోసం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందించిన వ్యక్తిగత ఆరోగ్య భీమా జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచింది.రామచంద్ర పురానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుమారుడు సుమంత్ రాజ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ అందించిన ఆరోగ్య భీమా ద్వారా సుమారు 12 లక్షల 50 వేల రూపాయల ఆరోగ్య భద్రత సహాయం అందింది. గత సంవత్సరం క్రితం సైతం ఇదే జర్నలిస్టు కుటుంబ సభ్యులకు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా పొందారు.ఈ సందర్భంగా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన ఆరోగ్య భీమా ద్వారా తన కుమారుడు పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడని జర్నలిస్ట్ ఆనందం వ్యక్తం చేశారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…