Telangana

సీఏఎంఏపీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు వివరించారు. వారు ప్రధానంగా నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, నెటినర్ గడ్డి, అశ్వగంధ, సెన్నా, కర్నేస్, మెంత,సరస్వతి, బ్రాహ్మి, గిలోయ్, మలబార్ నట్, రేవోల్సియా వంటి పలు ఔషధ మొక్కల విశేషాలు, వారి ప్రాముఖ్యతలనుతెలియజేశారు. తమ తోటలో పెరుగుతున్న మొక్కల జాతులు, వన మూలికలు, తీగలు, వాటిని పెంచే పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేశ విద్యార్థులకు వివరించారు.

సీఐఎంఏసీ ప్రయోగశాలల్లోని ఆధునిక పరికరాలు, క్లీనెంజర్ ఉపకరణం, సాక్స్ట్ ఎక్స్ ట్రాక్టర్, గ్యాస్ -క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ (జీఎస్-ఎంఎస్), హె-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీ ఎస్సీ), సుగంధ నూనెలను వెలికితీసే సాంకేతికతల గురించి మరో శాస్త్రవేత్త డాక్టర్ సత్య శ్రీనివాస్ విశదీకరించారు. కాగా, డిస్టిలేషన్ యూనిట్ల గురించి, సుగంధ మొక్కల నుంచి నూనె వెలికితీసే వివిధ పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు. తెలియజేశారు.ఫార్మసీ విద్యార్థులు శాస్త్రవేర్తలను అడిగి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫార్మసీ అధ్యాపకులు. డాక్టర్ విన్యాస్, డాక్టర్ జితేంద్ర పటేల్ తదితరులు శాస్త్రవేత్తలతో సంభాషించారు. వారికి కృతజ్ఞతా పూర్వ జ్ఞాపికను అందజేశారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

10 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

10 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

10 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

10 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago