Telangana

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు .

గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి మూడు కోట్ల రూపాయల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలియజేశారు . గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ప్రతియేటా నిర్వహించే గీతం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్య , ఆర్థికశాస్త్రం , సెన్స్ , సాహిత్యం , లలిత కళలు , ప్రజాసేవ వంటి రంగాలలో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ వివరించారు .

అవార్డు గ్రహీత గురించి :

లాష్ సత్యార్థి ( జననం 11 జనవరి 1954 ) మనదేశంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు విద్యపై సార్వత్రిక హక్కును సమర్థించారు . బాలల ఫౌండేషన్ ( ఎస్సీఎస్ ) ను ఆయన 2004 లో స్థాపించారు . ‘ బచన్ బచావో ‘ ఆందోళనలో కెల్లాస్ , ఆయన బృందం కలిసి మనదేశంలోని 86 వేల మందికి పెగా పిల్లలను బాల కార్మికులు , బానిసత్వం , అక్రమ రవాణాల నుంచి విముక్తి చేశారు . బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 1998 లో సత్యార్థి గ్లోబల్ మార్ను రూపొందించి , 103 దేశాలలో , 80 వేల కిలోమీటర్ల సుదీర్ఘ కవాతును నిర్వహించారు . అత్యంత దారుణమైన బాల కార్మికులకు వ్యతిరేకంగా యావత్తు ప్రపంచాన్ని ఒక తాటిపైకి తెచ్చారు . దోపిడీకి గురైన పిల్లల పక్షాన జరిగిన అతి పెద్ద సామాజిక ఉద్యమాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది . ఆయన సేవలకు గుర్తింపుగా , 2014 లో మలాలా యూసఫ్యితో కలిసి నోబెల్ శాంతి బహుమతి సహ – గ్రహీతగా ఎంపికయ్యారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళవుతున్న సందర్భంగా , ప్రభుత్వం పిలుపుమేరకు గీతమ్ ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ సంబరాలను నిర్వహించారు . జాతీయ జెండా , ప్లకార్డులను చేబూనిన విద్యార్థులు ర్యాలీ చేసి అందరినీ చెత్తన్యపరిచారు . ఈ ర్యాలీని రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ జెండా ఊపి ప్రారంభించగా , స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ పర్యవేక్షించారు . సీఎస్ఈ , సివిల్ విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ బి.శివరామకృష్ణ , ప్రసాద్ , పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు .

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago