పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి , అప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం విశేషం .
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పెబ్బిశెట్టి , పలువురు విద్యార్థులు పాల్గొన్నారు . ఫుడ్ సెన్స్డ్ , ప్యాకేజింగ్ , ఆవిష్కరణ రంగాలలో నెలకొని ఉన్న డిమాండ్ను తీర్చడానికి , కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి యువతలో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని 2020 లో గీతమ్లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఆరంభించినట్టు స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తెలియజేశారు . పరిశ్రమ , ఆస్పత్రులు , విమానయాన రంగాలలో ప్యాక్ చేసిన ఆహారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఔత్సాహిక యువత సొంత పరిశ్రమలు నెలకొల్పే యోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…