పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఫుడ్ టెక్నాలజీ ల్యాబరేటరీని మంగళవారం బీ – స్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ కరుణాకర్.బి ప్రారంభించి , ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను కూడా తిలకించారు . ఈ ప్రదర్శనలో బాడీ మాస్ ఇండెక్స్ ( బీఎంఐ ) , ఆహారంలో కల్తీని కనుగొనే సాధనాలు , పలు పరిశోధనలకు ఉపకరించే పరికరాలను ప్రదర్శించారు . ఆ ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ బీఎంఐ పరీక్షలు నిర్వహించి , అప్పటికప్పుడు ఫలితాలను వెల్లడించడం విశేషం .
ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వ్యవస్థాపక డెరైక్టర్ శ్రీధర్ పెబ్బిశెట్టి , పలువురు విద్యార్థులు పాల్గొన్నారు . ఫుడ్ సెన్స్డ్ , ప్యాకేజింగ్ , ఆవిష్కరణ రంగాలలో నెలకొని ఉన్న డిమాండ్ను తీర్చడానికి , కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి యువతలో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని 2020 లో గీతమ్లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ఆరంభించినట్టు స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తెలియజేశారు . పరిశ్రమ , ఆస్పత్రులు , విమానయాన రంగాలలో ప్యాక్ చేసిన ఆహారానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఔత్సాహిక యువత సొంత పరిశ్రమలు నెలకొల్పే యోచన చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…