Telangana

సాంకేతిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

– జాతీయస్థాయి బిట్స్ టెక్ ఎక్స్పోలో ద్వితీయ , తృతీయ స్థానాలు కైవసం

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి , తమ అత్యుత్తమ సాంకేతికత , ప్రదర్శనలకు గాను ద్వితీయ , తృతీయ స్థానాలను కెవసం చేసుకున్నారు . జీ – ఎలక్ట్రా ( స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ ) విద్యార్థులు ఇటీవల బిట్స్ హైదరాబాద్ వార్షిక ఫెస్ట్ ‘ ఆటమ్స్ – 22’లో తమ హోం ఆటోమేషన్ , బ్లెండెడ్ విజన్ ప్రాజెక్టులకు గాను నగదు పురస్కారాన్ని పొందినట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . దేశ నలుమూలల నుంచి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని , తమ నమూనాలు / ప్రోటోటెస్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు . గీతం ఈఈసీఈ రెండో ఏడాది విద్యార్థులు సి.దీపక్ , జి . అనిరుధ్ , బి.గురుప్రీత్ సింగ్ , సీహెచ్ . అమూల్యల బృందం హోం ఆటోమేషన్ ప్రాజెక్టును , మూడో ఏడాది విద్యార్థులు ఎంవీఎస్ఎన్ ప్రణవ్ , కె . మణికంఠ , దివ్యసాగర్ బృందం విజన్ ప్రాజెక్టులను ప్రదర్శించి , న్యాయమూర్తుల ప్రశంసలను పొందినట్టు డాక్టర్ మాధని వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పరిశోధనా ఇంజనీర్ వె.దామోదర్రావు , జీ – ఎలక్ట్రో క్లబ్ సమన్వయకర్తలు డాక్టర్ డి.అనిత , ఎం.నరేష్ కుమార్లు తదితరులు జాతీయస్థాయి పోటీలలో రాణించిన ఈ రెండు జట్ల సభ్యులను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

5 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago