Telangana

సాంకేతిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

– జాతీయస్థాయి బిట్స్ టెక్ ఎక్స్పోలో ద్వితీయ , తృతీయ స్థానాలు కైవసం

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

గీతం విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి , తమ అత్యుత్తమ సాంకేతికత , ప్రదర్శనలకు గాను ద్వితీయ , తృతీయ స్థానాలను కెవసం చేసుకున్నారు . జీ – ఎలక్ట్రా ( స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్ ) విద్యార్థులు ఇటీవల బిట్స్ హైదరాబాద్ వార్షిక ఫెస్ట్ ‘ ఆటమ్స్ – 22’లో తమ హోం ఆటోమేషన్ , బ్లెండెడ్ విజన్ ప్రాజెక్టులకు గాను నగదు పురస్కారాన్ని పొందినట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . దేశ నలుమూలల నుంచి పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని , తమ నమూనాలు / ప్రోటోటెస్ట్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు ఆమె తెలిపారు . గీతం ఈఈసీఈ రెండో ఏడాది విద్యార్థులు సి.దీపక్ , జి . అనిరుధ్ , బి.గురుప్రీత్ సింగ్ , సీహెచ్ . అమూల్యల బృందం హోం ఆటోమేషన్ ప్రాజెక్టును , మూడో ఏడాది విద్యార్థులు ఎంవీఎస్ఎన్ ప్రణవ్ , కె . మణికంఠ , దివ్యసాగర్ బృందం విజన్ ప్రాజెక్టులను ప్రదర్శించి , న్యాయమూర్తుల ప్రశంసలను పొందినట్టు డాక్టర్ మాధని వివరించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పరిశోధనా ఇంజనీర్ వె.దామోదర్రావు , జీ – ఎలక్ట్రో క్లబ్ సమన్వయకర్తలు డాక్టర్ డి.అనిత , ఎం.నరేష్ కుమార్లు తదితరులు జాతీయస్థాయి పోటీలలో రాణించిన ఈ రెండు జట్ల సభ్యులను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago