Hyderabad

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి :

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో ఒకసారి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాకా మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులను ఆపేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదల కాక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

కార్పొరేటర్‌లను ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇలా అయితే ప్రజలకు ఎం సమాధానం చెప్తామని ప్రశ్నించారు.వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్,సుప్రియ గౌడ్,రవి చారీ,వినయ్ కుమార్,రాంచన శ్రీ,, సరళ,సుచరిత,దీపికా,అరుణ, భాగ్యలక్ష్మి బొక్క,అలె భాగ్య లక్ష్మి,జంగం శ్వేతా,వెంకటేష్, లక్ష్మి గౌడ్,ఉమా రాణి,అమృత,వెంకట్ రెడ్డి,శంకర్ యాదవ్,లాల్ సింగ్,శశికళ,బోణీ దర్శన్,కరుణాకర్,స్రావం,సునీత,రాజ్య లక్ష్మి,చంద్ర రెడ్డి,మహేందర్,హరీష్,శ్రీవాణి బండారు,రాధా ధీరజ్ రెడ్డి,ఆకుల శ్రీవాణి,సంగీత,తోకల శ్రీనివాస్ రెడ్డి,అర్చన,లేచి రెడ్డి,రంగ నర్సింహా గుప్త, వంగ మధుసూదన్ రెడ్డి,ప్రేమ్ మహేష్ రెడ్డి,సుజాత,కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్,కొప్పుల నర్సింహా రెడ్డి,చింతల అరుణ యాదవ్,ర్ వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు 

పటాన్చెరు లో ఘనంగా విజయదశమి వేడుకలు

 

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago