Hyderabad

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి :

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. ప్రజాభిప్రాయంతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు మేయర్ నిర్లక్ష్యంగా బీజేపీ కార్పోరేటర్ల కు అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవకుండా అవమానించారని నగర బీజేపీ కార్పోరేటర్లు ఆరోపించారు. తాము మెమోరాండం ఇద్దామని వస్తే ఆరోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడం మేయర్ కు తగదన్నారు

ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో ఒకసారి కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాకా మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులను ఆపేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదల కాక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

కార్పొరేటర్‌లను ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారనీ, వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇలా అయితే ప్రజలకు ఎం సమాధానం చెప్తామని ప్రశ్నించారు.వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు సునీత ప్రకాష్ గౌడ్,సుప్రియ గౌడ్,రవి చారీ,వినయ్ కుమార్,రాంచన శ్రీ,, సరళ,సుచరిత,దీపికా,అరుణ, భాగ్యలక్ష్మి బొక్క,అలె భాగ్య లక్ష్మి,జంగం శ్వేతా,వెంకటేష్, లక్ష్మి గౌడ్,ఉమా రాణి,అమృత,వెంకట్ రెడ్డి,శంకర్ యాదవ్,లాల్ సింగ్,శశికళ,బోణీ దర్శన్,కరుణాకర్,స్రావం,సునీత,రాజ్య లక్ష్మి,చంద్ర రెడ్డి,మహేందర్,హరీష్,శ్రీవాణి బండారు,రాధా ధీరజ్ రెడ్డి,ఆకుల శ్రీవాణి,సంగీత,తోకల శ్రీనివాస్ రెడ్డి,అర్చన,లేచి రెడ్డి,రంగ నర్సింహా గుప్త, వంగ మధుసూదన్ రెడ్డి,ప్రేమ్ మహేష్ రెడ్డి,సుజాత,కళ్లెం నవజీవం రెడ్డి, పవన్ కుమార్ ముదిరాజ్,కొప్పుల నర్సింహా రెడ్డి,చింతల అరుణ యాదవ్,ర్ వెంకటేశ్వర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇక చదవండి

వివేకానంద బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన దేవేందర్ రాజు 

పటాన్చెరు లో ఘనంగా విజయదశమి వేడుకలు

 

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

9 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

9 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

9 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago