త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీనీ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని, ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే స్మశాన వాటికకి సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు. కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాలకు 7500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు ఆరువేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…