మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ప్రతిష్టాత్మక గాంధీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ నకు, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎం.ఏ. ఎకనామిక్స్ విద్యార్థిని ఆర్. నివేదిక ఎంపికైంది. ఈ విషయాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించాయి. న్యూఢిల్లీలోని పిరమల్ ఫౌండేషన్ అందించే, జాతీయంగా గుర్తింపు పొందిన నాయకత్వ కార్యక్రమం ఇదని, సామాజిక పరివర్తనకు కట్టుబడి ఉన్న యువతలో మార్పును ప్రోత్సహిస్తుందని వివరించారు. గాంధీ ఫెలోషిప్ అనేది 23 నెలల పాటు సాగే ఒక పరివర్తనాత్మక నాయకత్వ ప్రయాణమన్నారు. ఇది యువ నాయకులను క్షేత్రస్థాయిలో పనిచేసేలా శక్తివంతం చేయడానికి, భారతదేశం అంతటా ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడేలా రూపొందించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమం నాయకత్వ అభివృద్ధి, వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక ప్రభావాన్ని ఏకీకృతం చేసే ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందన్నారు. ఇది ఫెలోలు సమాజానికి సేవ చేస్తూ, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరిస్తూ, లోతైన ఆత్మపరిశీలన పొందేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ నకు నివేదిత ఎంపిక కావడం, సామాజిక మార్పు, సమాజ భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం, గీతంలో పెంపొందించిన సానుభూతి, సేవ, శ్రేష్ఠత వంటి విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు విశ్వవిద్యాలయ నాయకత్వం నివేదితను అభినందించడమే గాక, ఆమె ఈ ఫెలోషిప్ ద్వారా అర్థవంతమైన సేవలు అందిస్తూ, సమర్థవంతమైన నాయకురాలిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తపరిచినట్టు తెలియజేశారు.అభ్యాసం, నాయకత్వం, సమాజ సేవతో కూడిన ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో నివేదిత మరిన్ని విజయాలు సాధించాలని గీతం నాయకత్వం ఆకాంక్షించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…