Telangana

గీతం విద్యార్థిని నివేదితకు గాంధీ ఫెలోషిప్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ప్రతిష్టాత్మక గాంధీ ఫెలోషిప్ ప్రోగ్రామ్ నకు, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎం.ఏ. ఎకనామిక్స్ విద్యార్థిని ఆర్. నివేదిక ఎంపికైంది. ఈ విషయాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించాయి. న్యూఢిల్లీలోని పిరమల్ ఫౌండేషన్ అందించే, జాతీయంగా గుర్తింపు పొందిన నాయకత్వ కార్యక్రమం ఇదని, సామాజిక పరివర్తనకు కట్టుబడి ఉన్న యువతలో మార్పును ప్రోత్సహిస్తుందని వివరించారు. గాంధీ ఫెలోషిప్ అనేది 23 నెలల పాటు సాగే ఒక పరివర్తనాత్మక నాయకత్వ ప్రయాణమన్నారు. ఇది యువ నాయకులను క్షేత్రస్థాయిలో పనిచేసేలా శక్తివంతం చేయడానికి, భారతదేశం అంతటా ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడానికి దోహదపడేలా రూపొందించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమం నాయకత్వ అభివృద్ధి, వ్యక్తిగత ఎదుగుదల, సామాజిక ప్రభావాన్ని ఏకీకృతం చేసే ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందన్నారు. ఇది ఫెలోలు సమాజానికి సేవ చేస్తూ, వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరిస్తూ, లోతైన ఆత్మపరిశీలన పొందేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు.ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ నకు నివేదిత ఎంపిక కావడం, సామాజిక మార్పు, సమాజ భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వం పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఆమె సాధించిన ఈ విజయం, గీతంలో పెంపొందించిన సానుభూతి, సేవ, శ్రేష్ఠత వంటి విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు విశ్వవిద్యాలయ నాయకత్వం నివేదితను అభినందించడమే గాక, ఆమె ఈ ఫెలోషిప్ ద్వారా అర్థవంతమైన సేవలు అందిస్తూ, సమర్థవంతమైన నాయకురాలిగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తపరిచినట్టు తెలియజేశారు.అభ్యాసం, నాయకత్వం, సమాజ సేవతో కూడిన ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో నివేదిత మరిన్ని విజయాలు సాధించాలని గీతం నాయకత్వం ఆకాంక్షించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago