మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )
మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ ఉంది అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో భరత్ చంద్ర ఫంక్షన్ హాల్ లో తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ మాల మాదిగ జేఏసీ కన్వీనర్ దేవుని సతీష్ మాదిగ బిజెపి మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కరపత్రాలను విడుదల చేసిన గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కేసీఆర్.గెలిచాక ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
మునుగోడు నియోజకవర్గం లో దళిత వర్గాలను అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని దళితుల బ్రతుకులు మారాలంటే రాబోవు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని నియోజకవర్గంలోని దళిత వర్గాలను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ శాసనసభ్యులు చండూరు మున్సిపల్ ఇంచార్జ్ మారుతినేని ధర్మారావు గారు, సహ ఇంచార్జి నాగురాం నామోజీ గారు, తెలంగాణ మాదిగ దండోరా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల సైదులు మాదిగ గారు, తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…