politics

గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా

– కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో గచ్చిబౌలి డివిజన్ – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. కార్పోరేటర్ గా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రోజు గౌలిదొడ్డిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 23 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఈ సంవత్సరం లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.తాను గెలిచినప్పటి నుండి గచ్చిబౌలి డివిజన్ లో సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, చెరువుల సుందరీ కరణ పనులు, అంతర్గత రోడ్లు, పార్కుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.రాయదుర్గం నానక్ రామ్ గూడ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి, గోపన్ పల్లి తాండా, ఎన్ టి ఆర్ నగర్, తాజ్ నగర్, సాయి ఐశ్వర్య, సాయి వైభవ్, నల్లగండ్ల, టెలికం నగర్, మధురానాగర్, ప్రశాంత్ హిల్స్, నల్లగండ్ల హుడా కాలని ఇలా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇంకా కొన్ని పనులు చేపట్టాల్సి ఉందని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చేపట్టలేకపోతున్నామని, త్వరలోనే వాటికి కూడా ప్రణాళికలు రూపొందించి నిధులు విడుదల చేయించి అభివృద్ధి పనులు మొత్తం పూర్తి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలు ఏ సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చినా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ప్రజలు ఏ నమ్మకంతో నైతే తనను గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్,తిరుపతి దయాకర్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, ,గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత,గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్,సంజీవ్,సుబ్రమణ్యం,అరుణ్ గౌడ్, రంగస్వామి ముదిరాజ్, ముర్గ,విష్ణు,నగేష్ దుర్గరామ్,టీంకు,వెంకటేష్,సురేష్,సాయి,శ్రీను, స్థానిక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago