Telangana

గీతమ్ తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ అవగాహన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో రాజమండ్రిలోని ఐసీఎస్ఈ అనుబంధ పాఠశాల ఫ్యూచర్ కిడ్స్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఫ్యూచర్ కిడ్స్ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉన్నత విద్య ను అందించడం, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఈ అవగాహన కుదిరిందన్నారు. తన సమక్షంలో జరిగిన ఈ అవగాహనా ఒప్పందంపై గీతం రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్, ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ముఖ్య కార్యనిర్వహణాధి కారి ఏలేటి రుద్రశ్రీ మహస్వి సంతకాలు చేసినట్టు తెలియజేశారు. క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలకు ఫ్యూచర్ కిడ్స్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో పేర్గాంచిందన్నారు. గీతమ్ తో ఈ సహకారం, విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు సాఫీగా మారేలా చేస్తుందని తెలిపారు. ఫ్యూచర్ కిడ్స్ లోని త్రిభాషా పద్ధతికి, గీతం ఆంగ్ల మాధ్యమ బోధన తోడె ప్రపంచ అవసరాలను అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుందని వీసీ అభిలషించారు, ఫ్యూచర్ కిడ్స్ అత్యుత్తము ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గీతం వర్సిటీలోని పలు కోర్సులు, విభాగాలలో అందిస్తున్న ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రెండు సంస్థల అనువర్తిత అభ్యాసం గీతమ్ కి సూడే విద్యార్థులకు విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, అభ్యాస శైలిలో గణనీయమైన సర్దుబాట్ల అవసరాన్ని తొలగిస్తుందని డాక్టర్ దయానంద తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ కిడ్స్ ప్రిన్సిపాల్ శేష గిరిధర్, అకడమిక్ హెడ్ హర్షిణి, గీతం విశాఖపట్నం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ వై . గౌతమరావు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిర్మలరావు తదితరులు పాల్గొన్నారు .

గీతమ్ లో రక్తదాన శిబిరం

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,హైదరాబాద్ లోని డైరక్ట రేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సంయుక్తంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు . ఎన్టీఆర్ రక్త నిధి సౌజన్యంతో, రక్తదానాన్ని ప్రోత్సహించడం, క్లిష్టమైన పరిస్థితులలో ప్రాణాన్ని కాపాడడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో 61 యూనిట్ల రక్తాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది దానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కొందరు విద్యార్థులు స్వచ్ఛందంగా సహాయకులుగా పనిచేసి, కీలక పాత్ర పోషించారు. రక్తదానం చేసిన వారికి పళ్లరసం, బిస్కెట్లను అందించారు.విద్యార్థుల నిస్వార్థ సహకారానికి ప్రశంసా పూర్వక ధృవీకరణ పత్రాలను ఎన్టీఆర్ రక్తనిధి కేంద్రం వారు అందజేసి, సమాజానికి వారు చేసిన సేవను అభినందించారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago