: ఉమామహేశ్వర దేవాలయంలో అదనపు గదులు నిర్మాణానికి 14 లక్షల రూపాయల విరాళం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నూతన దేవాలయాల నిర్మాణాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు పట్టణ పరిధిలోని జెపి కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్వహిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ 14 లక్షల రూపాయల విరాళం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పది లక్షల రూపాయలు అందించగా, శనివారం మరో నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందించారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం పటాన్చెరువు మండలం భానూరు గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం సప్తమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…