పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. టెక్నాలజీ, మేనేజ్ మెంట్, సైన్స్ , ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ లలో 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం సీనియర్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.నూతన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి, విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందించి, వారంతా తమ స్వగృహంలోనే ఉన్నామనే భద్రతా భావనను కలిగించే లక్ష్యంతో ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. ఈ యేడాది వేడుకలలో ఆకర్షణీయమైన ర్యాంప్ వాక్, సాంప్రదాయ – సమకాలీన నృత్య ప్రదర్శనలు, స్థానిక జానపద ట్యూన్ లు, బాలీవుడ్ హిట్లతో కూడిన శ్రావ్యమైన పాటలు, వినోదాత్మక స్కిట్లు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. అందరగా అలంకరించిన ప్రాంగణంలో పసందైన నిందు ఈ వేడుకలను మరపురాని రోజుగా మార్చాయి.ఎంతో వుందిని ఆకట్టుకున్న ర్యాంప్ వాక్ లో విద్యార్థులు తము చరిష్మా, శైలిని ప్రదర్శించారు. ఇక మిస్టర్. అండ్ మిస్ ఫ్రెషర్స్ ప్రకటన కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసి, విజేతలను ప్రశంసలతో ముంచెత్తారు.తమ విద్యా లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా, వృత్తి నిపుణులుగా ఎదిగాలని ప్రతి ఒక్కరూ దీక్షబూనాలని మేనేజ్ మెంట్ ప్రతినిధులు ఫ్రెషర్స్ కు సూచించారు. గీతం కుటుంబంలోకి వారికి సాదరంగా స్వాగతించారు.సీనియర్ల నుంచి తమకు లభించిన సాదర స్వాగతానికి ఫ్రెషర్లు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి వారు చేసిన ప్రయత్నాలను అభినందించారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పడిన స్నేహబంధం గీతమ్ లోని శక్తివంతమైన కమ్యూనిటీకి నిదర్శనంగా నిలవడమే గాక, ప్రతి విద్యార్థికి విలువ ఉంటుందని మరోసారి రుజువు అయింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…