దేశంలోనే అత్యంత భారీ స్థాయిలో సూర్య దేవాలయం నిర్మాణం
ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి
ఛట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉత్తర భారతీయుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో పటాన్చెరు సాకి చెరువు కట్టపైన అత్యంత సుందరంగా, అన్ని సౌకర్యాలతో సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఉత్తర భారతీయులు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించే చట్ పూజ ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు ప్రాంతం నిలుస్తోందని తెలిపారు.. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తగు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి అభివృద్ధికి అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, గూడెం విక్రం రెడ్డి, పృథ్వి రాజ్, శ్రీధర్ చారి, సందీప్ శా, కిషన్, సంజయ్ సింగ్, ఉత్తర భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…