Districts

పంజాబ్‌ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం

బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం లో సాయినగర్, సాయిబాబా దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించామన్నారు .

ప్రధానికి పంజాబ్ పర్యటనలో భద్రతా కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన చేస్తున్న సేవలు ,కార్యక్రమాలు ,తీసుకొచ్చిన పథకాలు దేశం కోసం ఆయనే పడే తపన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ,దేశం కోసం, ధర్మం కోసం, పనిచేస్తున్న నరేంద్రమోడి ని ఎదుర్కొలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని గోదావరి అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ, అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేశ్, పద్మావతి, జిల్లా కార్యదర్శులు సరస్వతి, బైండ్ల కుమార్, సుజాత,స్వాతి, నర్సింగ్ గౌడ్, అదెల్లి రవీందర్, అసెంబ్లీ కన్వీనర్, శ్రీనివాస్ గుప్తా, అమీన్పూర్ అధ్యక్షులు అగారెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు పెంటెశ్, కృష్ణ రెడ్డి,గోవర్ధన్, బలరామ్, పద్మావతి,పూర్ణిమ, సంజీవ, విజయ్ కుమార్ గౌడ్, రవీందర్ గౌడ్ కృష్ణ వేణీ బృధం, పెంటారెడ్డి, రాంబాబు,రమేశ్ గుప్తా మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago