Hyderabad

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు…

గీతమ్ లో పీహెచ్డీ ప్రవేశాలకు...

జూన్ 15 న ‘ ఆర్ సెట్ ‘

పటాన్ చెరు:

గీతం డీమ్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ , ఫార్మశీ , లా , వివిధ సామాజిక శాస్త్రాలలో పరిశోధనలు జరపాలనుకునే వారికి జూన్ 15 వ తేదీన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( ఆర్ సెట్ ) నిర్వహిస్తున్నట్టు గీతం పరిశోధన , కన్సల్టెన్సీ సేవల విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు తెలిపారు . మొత్తం 40 శాస్త్ర విభాగాలలో 2020-21 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న ‘ ఆర్ సెట్’కు దాదాపు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని , అధికంగా ఇంజనీరింగ్ , సైన్స్ , మేనేజ్ మెంట్ విభాగాలకు దరఖాస్తులు అందినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ( యూజీసీ ) నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

ఆన్‌లైన్ విధానంలో 140 మార్కులకు గాను నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తామని తెలియజేశారు . ఇంటర్వ్యూ 60 మార్కులకు ఉంటుందన్నారు . ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు , వ్యక్తిగత ఇంటర్వ్యూలో అభ్యర్థి కనబరిచే ప్రతిభ ఆధారంగా పీహెచ్ డీలో ప్రవేశం కల్పిస్తామని రాజా తెలిపారు . మంగళవారం జరగనున్న ప్రవేశ పరీక్ష రెండు గంటల కాల వ్యవధి ఉంటుందని , దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అభ్యర్థులకు పంపామన్నారు . ఫలితాలను ఒక్క రోజులోనే వెల్లడిస్తామని డైరెక్టర్ తెలియజేశారు .

Ramesh

Recent Posts

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

3 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago