Telangana

కొత్త తరం ఔషధాలపై దృష్టి పెట్టండి…

– ఫార్మశీ విద్యార్థులకు నోవార్టిస్ డెరైక్టర్ సుభాస్ చంద్ర ఉద్బోధ

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

మారుతున్న కాలంతో పాటు మనం నిత్యం వాడే ఔషధాలకు కాలం చెల్లిపోతోంది , అందువల్ల తదుపరి తరం ఔషధాలపై ఫార్మశీ విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ లోని నోవార్టిస్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అసోసియేట్ డెరైక్టర్ ఎం.సుబాస్ చంద్ర ఉద్బోధించారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఫార్మశీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు . మనం వినియోగిస్తున్న మాలి క్యూల్ ఔషధాలు త్వరలో కనుమరుగు కానున్నాయని , ఇకమీదట బయోలాజిక్స్ , బయోసిమిలర్లు , సెల్ – జీన్ థెరపీ , రేడియో మెడిసిన్తో వ్యవహరించే అధునాతన యాక్సిలరేటర్ అప్లికేషన్లు , న్యూక్లియర్ మెడిసిన్ వంటివి మనగడలోకి రానున్నట్టు చెప్పారు . ఈ రంగాలలోకి ప్రవేశించి , నూతన సవాళ్ళను ఎదుర్కోవడానికి విద్యార్థులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు . మానవ జీవితం నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంటుందని , ఆరోగ్యం , వృత్తి , ఆర్థిక నిర్వహణ , ఇతరులతో మన సంబంధాలుగా సుబాస్ అభివర్ణించారు .

అధ్యాపకుల కంటే కూడా కెరీర్ మెంటర్లకు ప్రాధాన్యం పెరిగిందని , వారు చేయిపట్టి నడిపించడంతో పాటు దీపపు స్తంభం వలె మార్గదర్శనం చేస్తారని , తల్లిదండ్రుల కంటే విద్యార్థులను బాగా అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు . సాఫ్ట్స్కిల్స్ లేక చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థుల కూడా ఇంటర్వ్యూ దశలో తిరస్కరణకు గురవుతున్నారని , వాక్చాతుర్యం , ఇతరులతో కలిసి పనిచేయగలగడం , త్వరగా కొత్తవారితో కలిసిపోవడం , నిజాయితీ , సమగ్రతలను ప్రతిఒక్క విద్యార్థి పెంపొందించుకోవాలన్నారు . విజయం సాధించాలంటే విలువలు , ప్రవర్తనను కాపాడుకోవాలని స్పష్టీకరించారు . అభ్యాసం , ఆత్మవిశ్వాసం లేకుండా ప్రతిభకు అర్థం లేదని నొక్కి చెప్పారు . పోలిక , పోటీ , గందరగోళం అనే మూడు అంశాలు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు . ప్రశ్నించే తత్త్వాన్ని ప్రతిఒక్కరూ అలవరచుకోవాలని ఆయన సూచించారు . మన నమ్మకాలను సరిదిద్దుకోవాలని , జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని , మనకంటూ ఓ గుర్తింపును పొందాలని చెప్పారు .

మనలో నిబిడీకృతంగా ఉన్న సామర్థ్యాన్ని కనుగొని , దానిని వెలికితీసే ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సుబాస్ సలహా ఇచ్చారు . నాట్కో ఫార్మా అసోసియేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ , సాంకేతిక అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని , దానిని ఫార్మా పరిశ్రమలో ఎలా వినియోగించుకోవచ్చో యోచించాలన్నారు . విజ్ఞానాన్ని పెంపొందించు కునేందుకు , కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ తరహా సదస్సులు దోహదపడతాయని స్లేబ్యాక్ ఫార్మా డెరైక్టర్ హరీష్ జి.చిన్నారి అభిప్రాయపడ్డారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ స్వాగతవచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఫార్మాస్యూటిక్స్ దిగ్గజుడిగా పేరొందిన ప్రొఫెసర్ సీవీ సుబ్రమణ్యం , జి.పుల్లారెడ్డి ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.వీరేష్ , ఎంఎన్ఆర్ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.అళగరస్వామిలను సత్కరించారు . పరిశోధనా పత్రాల సంకలనాన్ని ఆవిష్కరించారు . జంట నగరాల్లోని దాదాపు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నగా , నిర్వాహక కార్యదర్శి కింగ్స్టన్ రాజయ్య వందన సమర్పణతో ముగిసింది .

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

21 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

21 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

21 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago