మనవార్తలు,మెదక్ :
ఈటెల రాజేందర్ గెలుపుతో మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ముందు బిజెపి నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కాల రాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ ఈటల రాజేందర్ గెలుపు సందర్భంగా ఆనందోత్సాహాల్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల భారీ మెజారిటీతో గెలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .
తెరాస ప్రభుత్వం బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు అర్థం చేసుకొని బిజెపి చేస్తున్న పరిపాలన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చూసి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలుపొందడం హర్షదాయకం అని అన్నారు. ఈ గెలుపు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాంటిది అన్నారు.
ఈటల రాజేందర్ 20 వేల మెజారిటీతో ప్రత్యర్థి అయిన టిఆర్ఎస్ అభ్యర్థి పై భారీ మెజార్టీతో గెలుపొందిన టిఆర్ఎస్ కు దిమ్మతిరిగేలా చేసిందన్నారు. బిజెపిని వ్యతిరేకించే వారికి ఇదే గతి పడుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాల్లో గెలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కు భారీ మెజార్టీ ఇచ్చిన హుజురాబాద్ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా సెక్రెటరీ రవి, శామయ్య, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…