▪️ శరత్ సిటీ మాల్లో 3 రోజుల పాటు ఈవెంట్
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (ఏఎంబి మాల్ ) కొండాపూర్లో వింధ్య గోల్డ్ సిల్వర్ బార్ ఛాలెంజ్ను హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మే 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది.ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ, “ఈవెంట్ చాలా వైవిధ్యంగా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి నమ్మకమైన బ్రాండ్ నిర్వహిస్తుండటంతో మరింత విశ్వసనీయంగా అనిపిస్తోంది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్ కు బంగారు భరోసా లాంటిది అని” అని పేర్కొన్నారు. గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్లో సందర్శకులతో పాటు హెబ్బా పటేల్ సందడి చేసి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఛాలెంజ్లో విజేతలకు బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేయడం ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఆభరణాల్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న వింధ్య గోల్డ్, ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్ విశ్వసనీయతను మరింత బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…