Districts

రాష్ట్రం లో రైతులకు రక్షణ లేదు:రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం:

సోమవారం నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు రామచంద్రపురం పట్టణం లో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతు ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల పరామర్శకు వెళ్లిన బండి సంజయ్ గారు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయపెడుతోందని ప్రశ్నించారు.

హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ మోసాన్ని రైతులు గ్రహించారని అదేవిధంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎలాటి చర్యలు తీసుకోకపోవటం చాలా సిగ్గుచే టు అని అన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే భాద్యత వహించాలని  గోదావరి అంజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మణ్, రాములు, మల్లేష్ ,లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

 

 

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

6 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

9 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago