పటాన్ చెరు:
నూతన విద్యా విధానం ( ఎన్ఎస్ఈపీ ) పరివర్తనాత్మక మార్పుకు ఉద్దేశించారని , సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలయినప్పుడు విద్యను కొనసాగించే వెసులుబాటు కూడా ఉందని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్ ( హెస్ఆర్డీసీ ) ప్రొఫెసర్ వె.నరసింహులు అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ జాతీయ విద్యా విధానం’పై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గూగుల్లో అందుబాటులో ఉన్న దానికంటే నాణ్యమైన బోధన చేయగలిగిన అధ్యాపకులు విద్యార్థుల మన్ననలను చూరగొనగలరని అన్నారు . పాఠ్యాంశాలను స్వల్ప నిడివి గల వీడియోలుగా రూపొందించి పరిమితి విధించకుండా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు .
సబ్జెక్టుల ఎంపికలో విద్యార్థి అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని , ఆన్లైన్లో నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలన్నారు . డిస్రష్టివ్ సాంకేతికతల ఆవిర్భావాన్ని నొక్కిచెబుతూ , ఇది మన భవిష్యత్తునే మార్చబోతోందని చెప్పారు . ప్రశ్నించే ధైర్యంతో పాటు సృజనాత్మక నిర్మాణంతో కూడిన విద్యను అందించాలని విజ్ఞప్తి చేశారు . చాలా ఉద్యోగాలు అభిజ్ఞా నైపుణ్యాలు ( కాగ్నెటివ్ స్కిల్స్ ) తో ముడిపడి ఉన్నాయని , చక్కగా రాయడం , మంచి భావప్రకటనా నెపుణ్యాలు ఉన్నవారిని పరిశ్రమ కోరుకుంటోందని చెప్పారు .
కళాశాలలో సీటు నుంచి ఉద్యోగాలకు ఇంటర్వ్యూల వరకు ప్రతి దశలోనూ విద్యార్థిని పరీక్షిస్తారని , అందువల్ల మార్కుల గురించి అధ్యాపకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని , వారిలో నైపుణ్యాలు పెంపొందించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు . ఆన్లైన్ కోర్సులు , డిజిల్ రిపోజిటరీలు , పరిశోధనలకు నిధులు , మెరుగైన సేవలు , మూక్స్ , క్రెడిట్ ఆధారిత గుర్తింపు వంటి వాటికి నూతన విద్యా విధానం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు . తొలుత , మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్ అతిథిని స్వాగతించగా , ప్రొఫెసర్ కె.మంజునాథాచారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…