పటాన్ చెరు:
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పై ఈనెల 11 నుంచి 13 వ తేదీ వరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ) నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ మంగళవారం పేర్కొన్నారు. అధ్యాపకుల నెపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారు ప్రపంచ స్థాయి సామర్థ్యాలను సంపాదించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో అధ్యాపకులతో పాటు పరిశోధక – పీజీ విద్యార్థులు, పరిశ్రమకు చెందిన వారు కూడా పాల్గొనవచ్చన్నారు. ఈ ఎఫ్ డీపీలో పాల్గొనే వారందరికీ రాస్ప్బెర్రీ కిట్ తో పాటు ప్రశంసా పత్రం కూడా ఇస్తామని తెలియజేశారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున, ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పేర్ల నమోదు, రుసుము తదితర వివరాల కోసం సదస్సు సమన్వయకర్త డాక్టర్ ప్రవీణ్ ముండే (91402 75365) ను సంప్రదించాలని లేదా pmundhe@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…