Telangana

ఫార్మసీ విద్యార్థులకు గీతమ్ లో ఉత్తేజకర పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం- 2024 (ఈనెల 25న) పురస్కరించుకుని ఫార్మసీ విద్యార్థుల కోసం. ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సంకల్పించింది. ఈ పోటీలలో వ్యాస రచన, పోస్టర్ ప్రదర్శన, మౌఖిక ప్రదర్శన, క్విజ్ వంటివి ఉంటాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్టులు కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని (ప్రస్పుటం చేసే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఫార్మసీ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని డాక్టర్ శివకుమార్ తెలియజేశారు. వ్యాస రచన పోటీలలో పాల్గొనేవారు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర, టెలిఫార్మసీ వంటి అంశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. సురక్షితమైన ఔషధ వినియోగ పద్ధతులు, గ్రామీణ ఆరోగ్యంలో అంతరాన్ని తగ్గించడం, మానసిక ఆరోగ్యానికి ప్రపంచ సహకారం వంటి విషయాలపై పోస్టర్ ప్రదర్శనను రూపొందించవచ్చని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య విధానం, ఇతర సంబంధిత రంగాలలో ఫార్మసిస్టుల నాయకత్వంపై మౌఖిక ప్రదర్శన చేయొచ్చన్నారు, ముగ్గురు లేదా నలుగురు జట్టుగా (విడివిడిగా పేర్లు. నమోదు చేసుకోవాలి) గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ప్రత్యక్షంగా నిర్వహించే క్విజ్ పోటీలలో పాల్గొనాలని చెప్పాడు.ఆసక్తి గల ఫార్మసీ విద్యార్థులు తను ఎంట్రీలను gpsa_hyd@gitam.in ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలని, విజేతలకు ఉత్తేజకర బహుమతులు, అవార్డులను ప్రదానం చేస్తామని ప్రొఫెసర్ శివకుమార్ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థి సమన్వయకర్తలను (7330 778 199 లేదా 89777 14744) సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago