_స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు
కాలనీలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన ఐదు స్వచ్ఛ చెత్త సేకరణ ఆటోలను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. పటాన్చెరు డివిజన్ కి రెండు, రామచంద్రాపురం డివిజన్ కి రెండు, భారతి నగర్ డివిజన్ కు ఒక ఆటో కేటాయించినట్లు తెలిపారు.
మూడు డివిజన్లలో ప్రస్తుతం 87 స్వచ్ఛ ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయనీ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని చెత్త సేకరణ ఆటోలు, రిక్షాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, కష్టం మెడికల్ ఆఫీసర్ రంజిత్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…