మనవార్తలు ,అమీన్ పూర్
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని నవ్య నగర్ నుండి బీరంగూడ శివాలయం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ ని స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం లో మొదటి స్థానం నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ప్రతి కాలనీ పరిధిలో అంతర్గత మురికినీటి కాలువల నిర్మించడంతో పాటు, బహిరంగంగా చెత్త వెయ్యకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…