Telangana

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరిన అఖిలపక్ష బృందం నాయకులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పాత అమీన్పూర్ మండల పరిధిలోని ఎనిమిది గ్రామాల అఖిలపక్ష బృంద సభ్యులు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమీన్పూర్ పేరుతో కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, సుల్తాన్పూర్, జానకంపేట, దాయర, ఐలాపూర్, ఐలాపూర్ తాండ, వడకపల్లి గ్రామాలతో కలిసి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమీన్పూర్ మున్సిపాలిటీనీ జిహెచ్ఎంసి లో విలీనం చేయడంతో పాటు బీరంగూడ, అమీన్పూర్ కేంద్రాలుగా రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విభజనలో అమీన్పూర్ మండలానికి తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. 8 గ్రామాల పరిధిలో 60 వేలకు పైగా జనాభాతో పాటు సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్క తో పాటు 40 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని వారు తెలిపారు. పరిపాలన సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి నూతన డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచులు కృష్ణ , శ్రీకాంత్, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago