డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి
సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఈఎస్ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలంటూ హైదరాబాద్ లోని ఈ ఎస్ ఐ సి కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ అనిత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల మంది ఇన్సూరెన్స్ పర్సన్స్ గా ఉన్నారని, 2024.2025 సంవత్సరానికి 325 కోట్ల రూపాయలు మాత్రమే ఈఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్కొక్క ఐ పి మెంబర్ కు 3000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, రాష్ట్రంలోని ఐపి మెంబర్ల ద్వారా 725 కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ కు వెళుతున్నప్పుడు, కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయవలసిన బాధ్యత ఈఎస్ఐ కార్పొరేషన్ మీద ఉన్నప్పటికీ కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన మళ్లిస్తున్నారని ఆరోపించారు.
ఇందులో 65% నిధులను జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ, కేవలం 35% నిధులను మాత్రమే కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈఎస్ఐ కార్మికుల నిధుల పైన సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 69 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయని డిస్పెన్సరీల అభివృద్ధి కోసం నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఒక్క రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ పరిధిలో మూడు లక్షల మంది ఐపీ మెంబర్స్ ఉన్నారని గుర్తు చేశారు. పటాన్ చెరు,పాటి, బొల్లారం, బొంతపల్లి, ఇస్నాపూర్, సదాశివపేట, జహీరాబాద్ డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలని అన్నారు. అనేక డిస్పెన్సరీలలో మందుల కొరత, సర్జికల్ ఐటమ్స్, మెడికల్ కిడ్స్, సమస్య తీవ్రతరమవుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ కు ప్రతినెల చెల్లించిన, ఈఎస్ఐ హాస్పిటల్స్ లలో మెరుగైన సౌకర్యాల కోసం 100% గా ఉన్న నిధులలో ఎందుకు 75 శాతం నిధులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు.
40 సంవత్సరాలు పైబడిన ఐపి కుటుంబాలకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని11.03.2026 న జారి చేశారన్నారు. నిబంధనలు ఉన్న ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించ లేదని, నెలకు ఒకసారి ఐపీ సభ్యుల కు ఒకసారి అందించవలసిన సూపర్ స్పెషాలిటీ మందులు కూడా కేవలం ఒక నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో మాత్రమే అందిస్తున్నారని రాష్ట్రమంతా ఉన్న ఐపి సభ్యులు ఎలా నాచారం వెళ్లి తీసుకుంటారని ప్రశ్నించారు. కార్మికుల డబ్బులను ప్రతి నెల ఈఎస్ఐ కార్పొరేషన్ లో జమ చేస్తున్నందున కార్మికుల మెరుగైన సౌకర్యాల కోసం ఖర్చు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ఈఎస్ఐని పకడ్బందీగా అమలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు బి అర్జున్ లు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మే 10వ తేదీన పటాన్చెరు పీవీ…
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…
గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…