Telangana

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలి

డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి

సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో ఈఎస్ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలంటూ హైదరాబాద్ లోని ఈ ఎస్ ఐ సి కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ సిహెచ్ అనిత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాజిద్ అలీ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల మంది ఇన్సూరెన్స్ పర్సన్స్ గా ఉన్నారని, 2024.2025 సంవత్సరానికి 325 కోట్ల రూపాయలు మాత్రమే ఈఎస్ఐ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్కొక్క ఐ పి మెంబర్ కు 3000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, రాష్ట్రంలోని ఐపి మెంబర్ల ద్వారా 725 కోట్ల రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ కు వెళుతున్నప్పుడు, కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయవలసిన బాధ్యత ఈఎస్ఐ కార్పొరేషన్ మీద ఉన్నప్పటికీ కార్పొరేషన్ నిధులను దొడ్డిదారిన మళ్లిస్తున్నారని ఆరోపించారు.

ఇందులో 65% నిధులను జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ, కేవలం 35% నిధులను మాత్రమే కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈఎస్ఐ కార్మికుల నిధుల పైన సమగ్రమైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 69 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయని డిస్పెన్సరీల అభివృద్ధి కోసం నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ఒక్క రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ పరిధిలో మూడు లక్షల మంది ఐపీ మెంబర్స్ ఉన్నారని గుర్తు చేశారు. పటాన్ చెరు,పాటి, బొల్లారం, బొంతపల్లి, ఇస్నాపూర్, సదాశివపేట, జహీరాబాద్ డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలని అన్నారు. అనేక డిస్పెన్సరీలలో మందుల కొరత, సర్జికల్ ఐటమ్స్, మెడికల్ కిడ్స్, సమస్య తీవ్రతరమవుతున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ కు ప్రతినెల చెల్లించిన, ఈఎస్ఐ హాస్పిటల్స్ లలో మెరుగైన సౌకర్యాల కోసం 100% గా ఉన్న నిధులలో ఎందుకు 75 శాతం నిధులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు.

40 సంవత్సరాలు పైబడిన ఐపి కుటుంబాలకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని11.03.2026 న జారి చేశారన్నారు. నిబంధనలు ఉన్న ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించ లేదని, నెలకు ఒకసారి ఐపీ సభ్యుల కు ఒకసారి అందించవలసిన సూపర్ స్పెషాలిటీ మందులు కూడా కేవలం ఒక నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో మాత్రమే అందిస్తున్నారని రాష్ట్రమంతా ఉన్న ఐపి సభ్యులు ఎలా నాచారం వెళ్లి తీసుకుంటారని ప్రశ్నించారు. కార్మికుల డబ్బులను ప్రతి నెల ఈఎస్ఐ కార్పొరేషన్ లో జమ చేస్తున్నందున కార్మికుల మెరుగైన సౌకర్యాల కోసం ఖర్చు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ఈఎస్ఐని పకడ్బందీగా అమలు చేసే విధంగా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు బి అర్జున్ లు పాల్గొన్నారు.

admin

Recent Posts

పెండింగ్ బిల్లుల కోసం తెలంగాణ కాంట్రాక్టర్ల ‘చలో హైదరాబాద్’ మహాసభ

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : హైదరాబాద్ మాదాపూర్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో కాంట్రాక్టర్ల పేండింగ్ బిల్లులు…

2 days ago

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కార్మికులకు చట్టబద్ధంగా రావలసిన సౌకర్యాలు, యజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ హక్కులు కల్పించకుండ పేరుకే బిస్లరీ…

2 days ago

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో 6వ ఎడిషన్‌ను టైమ్స్ ఆఫ్ ఇండియా,…

2 days ago

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తి కావాల్సిందే పాలకవర్గం సభ్యులు,…

3 days ago

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

నాణ్యమైన విద్యకు చిరునామా ప్రభుత్వ విద్యాసంస్థలు పటాన్‌చెరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ…

3 days ago

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

- ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలి - సాయిబాబా మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి…

3 days ago