Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం.. నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.గురువారం జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్ గారి ఆధ్వర్యంలో మత్స్య సంఘం భవన ప్రారంభోత్సవం తో పాటు సత్యనారాయణ వ్రతం, కార్తీక మాస వన భోజనాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. మత్స్యకారుల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో చేపల పెంపకానికి చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభించిందని, మత్స్యకారుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శివ కేశవులని పూజిస్తూ ఏర్పాటు చేసిన వన బోజనాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన బోజనాలు ఐక్యతను సూచించడంతో పాటు మనషుల మధ్య స్నేహభావం పెంపొదిస్తుందని తెలిపారు. మనం ఐకమత్యంగా ముందుకు కదిలితేనే సమాజంలో మన జాతికి గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్,కాంగ్రెస్ నాయకులు ఎట్టయ్య, మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, గారెల మల్లేష్, మాణిక్యరావ్, లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్,అశోక్,గణేష్,వీరేష్, పూజరి రాజు, సాయి,శ్రీశైలం,రఘు, మహిళలు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago