Telangana

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గీతం అంతర్జాతీయ సదస్సులో స్పష్టీకరించిన వక్తలు * ఘనంగా ప్రారంభోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుందని, అందరూ తమవంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ హిత చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో “పర్యావరణ, సామాజిక, పాలనలో సమకాలీన సమస్యలు’ (ఈఎస్ జీ ) అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలతో ఘనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఎస్ డీసీ ), నాబార్డుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా నాబార్డు జనరల్ మేనేజర్ పీ.టీ.ఉష, అరబింబో ఫార్మా సలహాదారు డాక్టర్ జేవీఎన్ రెడ్డిలు పాల్గొనగా, ఐఎస్ డీసీ కార్యనిర్వాహక డైరక్టర్ తెరసా జాకబ్స్ కీలకోపన్యాసం చేశారు.

ఈఎస్ జీ సమకాలీన స్వభావాన్ని, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఉష, ప్రస్తావించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్వయం సమృద్ధి కోసం నాబార్డు చేసడుతున్న పలు పథకాలను ఆమె ఏకరువు పెట్టారు. ఈఎస్ జీ తన ఆలోచనలను జేడీఎన్ రెడ్డి సదస్యులతో పంచుకోవడంతో పాటు అన్ని పరిశ్రమలలో సుస్థిరత యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అరబిందో ఫార్మా పరిశ్రములో చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలు, సౌర విద్యుత్ వినియోగం వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ప్రాకృతిక వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని, ఈ భూమిని కాపాడుకోవడానికి అంతా తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈఎస్ జీలో వ్యక్తిగత బాధ్యత, పాలనా సూత్రాల శక్తిని తనదిన శైలిలో తెరెసా జాకబ్స్ వివరించారు. ప్రతి పౌరుడూ తన సామాజిక బాధ్యతలో భాగంగా పర్యావరణ హిత కార్యకలాపాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.కార్పొరేట్ వ్యూహాలు, పెట్టుబడి నిర్ణయాలు, సామాజిక పురోగతిలో ఈఎస్ జీకి పెరుగుతున్న ప్రాముఖ్యతలను గీతం బీ-స్కూల్ ఇన్చార్జి డైరక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా నొక్కి చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లు, అవకాశాలపై అర్థవంతమైన చర్చ, విభిన్న దృక్కోణాలను ఆవిష్కరించడం కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు.ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వాహకుడు డాక్టర్ జీఆర్ కె ప్రసాద్ వందన సమర్పణతో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది. శనివారం వరకు కొనసాగనున్న ఈ సదస్సులో భాగంగా, ఈఎస్ జీపై చర్చాగోష్టులు, నిపుణులతో ప్రసంగాలను కూడా నిర్వహిస్తున్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago