Districts

బహుళజాతి కంపెనీలకు ధీటుగా వర్ధమాన మార్కెట్లు..

– గీతం బీస్కూల్ ఆతిథ్య ఉపన్యాసంలో అమెరికా ప్రొఫెసర్ రామ్మూర్తి

మనవార్తలు ,పటాన్ చెరు:

వర్ధమాన మార్కెట్లు తను వ్యూహాత్మక కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయ వ్యాపారులను ఆకర్షించాయని , బహుళజాతి సంస్థలకు ధీటుగా దేశీ కంపెనీలూ రాణిస్తున్నాయని అమెరికా , బోస్టన్లోని సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రావి రామ్మూర్తి అన్నారు . గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ‘ బహుళజాతి కంపెనీల అంతర్జాతీయ వ్యాపార ప్రణాళిక రూపకల్పనలో భారతదేశం పాత్ర అనే అంశంసే శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు . అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో స్థిరమైన వ్యాపార వృద్ధిని నిర్ధారించడానికి బహుళజాతి కంపెనీలు అవలంబిస్తున్న అమ్మకం , వనరులు , ఆవిష్కరణలు , నేర్చుకోవడం అనే నాలుగు పార్శ్వాలను ఆయన ఆవిష్కరించారు . జీఈ ( జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ ) జిల్లెట్ , ప్యాంపర్స్ , ఎం – బ్యాంకింగ్ వంటి ప్రపంచ బ్రాండ్ గురించి ఆయన సోదాహరణంగా వివరించారు .

తన మానస పుత్రిక అయిన ‘ రివర్స్ ఇన్నోవేషన్ ‘ ప్రక్రియను అనుసరించడంలో ‘ ప్రత్యక్ష ఉదాహరణలను ప్రొఫెసర్ రామ్మూర్తి ఈ సందర్భంగా ఉటకించారు . ఈ ఆతిథ్య ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడంలో గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిష్ కీలక భూమిక పోషించారు . తొలుత , గీతం బీస్కూల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ కార్యక్రమంలో హెబీబీఎస్ అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొని గొప్ప అభ్యాస అనుభవాన్ని పొందారు . పలు సందేహాలను అతిథిని అడిగి నివృత్తి చేసుకున్నారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

12 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

12 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

12 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

12 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

13 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

3 days ago