పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిద్దిపేట ఇలాకలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రోజు సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. స్థానిక బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, నర్సాపురం క్రాస్ రోడ్, లాల్ కమాన్, గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు ప్రచార ర్యాలీని చేపట్టారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి కొండా సురేఖ, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిద్దిపేట ఇన్చార్జి పూజల హరికృష్ణ, గజ్వేల్ ఇన్చార్జి తూముకుంట నర్సిరెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకురాలు తూముకుంట ఆకాంక్ష హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచార రథంలో అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ముఖ్యంగా యువత ఒకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయా పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో వారికి ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మంత్రి సురేఖ, అభ్యర్థి నీలం మధుకు మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు టీ.శ్రీనివాస్ గౌడ్, గంప మహేందర్, కలీమొద్దీన్, సాకి ఆనంద్, బుచ్చిరెడ్డి, మార్క సతీష్, అత్తు ఇమామ్, లక్ష్మి, చక్రధర్ గౌడ్, దేవులపల్లి యాదగిరి, చిట్టి దేవేందర్ రెడ్డి, ఎస్టిడి శ్రీనివాస్, మీసం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి బొమ్మల యాదగిరి, దర్పల్లి చంద్రం, పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…