Telangana

మెట్లబావుల పునరుజ్జీవానికి కృషిచేయాలి

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పిలుపునిచ్చిన ప్రఖ్యాత రూపశిల్పి యశ్వంత్ రామమూర్తి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సాంస్కృతిక మైలురాళ్ల వంటి మెట్లబావులను సంరక్షించుకోవాలని, మన వారసత్వ సంపదను పరిరక్షించు కోవడంతో పాటు వాటి పునరుజ్జీవానికి కృషిచేయాలని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ‘తెలంగాణ మర్చిపోయిన మెట్లబావులు’ అనే అంశంపై మంగళవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో కీలకమైన, ఇంకా తరచుగా విస్మరించబడిన మెట్లబావుల ప్రాముఖ్యతపై దృష్టిసారించి, ఈ ప్రాంతం యొక్క నిర్మాణ వారసత్వం యొక్క గొప్ప అన్వేషణను ఆవిష్కరించారు.తెలంగాణలోని మెట్లబావులను గుర్తించి, వాటిని డాక్యుమెంట్ చేయడానికి అంకితం చేసిన తన విస్తృతమైన ఆరేళ్ల ప్రయాణంపై రామమూర్తి, తన లోతైన అవగాహనను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ అద్భుతమైన నిర్మాణాల యొక్క చారిత్రక, సామాజిక, ఆర్థిక అంశాలపై పలు వివరాలను వెల్లడించడమే గాక, చరిత్ర అంతటా నీటి సంరక్షణ, సమాజ జీవితంలో వాటి కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఈ ఉపన్యాసాన్ని విన్న విద్యార్థులకు మెట్లబావుల నిర్మాణ అంశాలపై లోతైన అవగాహనతో పాటు, అమూల్యమైన జ్జానాన్ని అందించారు. ఇది ప్రస్తుత ఆర్కిటెక్చర్ విద్యార్థులతో పాటు ఫీల్డ్ లోని నిపుణులకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.తొలుత, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ కరుణాకర్.బి, యశ్వంత్ రామమూర్తిని స్వాగతించి, సత్కరించారు. చివరగా, ఆర్కిటెక్చర్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా వందన సమర్పణ చేశారు.ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా, నిర్మాణ వారసత్వంపై విద్యార్థులకు లోతైన అవగాహనను పెంపొందించడమే గాక, విస్తృత సమాజంలో వారసత్వ పరిరక్షణకు వినూత్న విధానాలను స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోత్సహిస్తోంది.

 

సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఇంటీరియర్ డిజైనర్ ది కీలక పాత్ర: బందన్ కుమార్ మిశ్రా

కార్యాచరణ, సౌందర్యాలను మెరుగుపరచడలో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అంతర్గత డిజైన్లను రూపొందించడంలో వారి కీలక భూమికలను గీతం స్కూల్ ఆఫ్ డైరెక్టర్ బందర్ కుమార్ మిశ్రా వివరించారు. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. సమకాలీన ఆర్కిటెక్చర్ లో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర, వారి బాధ్యతలు, బహుముఖ స్వభావాల గురించి అక్కడి విద్యార్థులకు డాక్టర్ మిశ్రా లోతైన అవగాహనను కల్పించారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

13 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago