Telangana

సమాజంలో సమానత్వాన్ని పెంచేది విద్య  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

విద్యా భారతి పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల రూపాయల భారీ విరాళం

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు:

విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని సమాజ అభివృద్ధికి వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు జాతీయ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించడంలో విద్యా భారతి సంస్థల కృషి అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి సంస్థ దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, భారతీ విద్యా సమితి అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, కార్యదర్శి రవి, టప్ప కుమార్, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

12 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

12 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

12 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

12 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

22 hours ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago