మనవార్తలు ,పటాన్ చెరు:
దేశ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం అశోకనగర్ వేడుక హాల్లోనూ ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవ దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఆయా క్రైస్తవ దేవాలయాలలో పునరుత్థానుడైన ఏసుక్రీస్తు గూర్చి భక్తి గీతాలు ఆలపించగా, బోధకులు శుభ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు ప్రభువు మానవాళి పాపాలను సిలువ మీద మోసి మరణించి,తిరిగి లేచి 2022సవంత్సరాలైయ్యిందని, మరియు ఈ రోజు జరిగిన అటువంటి ఆ కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ,పునరుద్ధరడుగా చరిత్రలో మరణమును జయించిన వ్యక్తిగా యేసు క్రీస్తు వారు మాత్రమే ఉన్నారని తెలిపారు.
అలయాల్లో జరిగే ఈస్టర్ వేడుకలకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ ఆలయాలకు చేరుకుని ప్రార్థలు చేశారు. ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తోంది ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి అని అని బోధకులు తెలిపారు .ఈ పండుగను పురస్కరించుకుని అన్ని చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. శాంతి ,ప్రేమ,కరుణ అలాగే క్షమించే తత్వాన్ని మనo అందరం ఆచరించాలని ,ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని అకాక్షించారు.ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మహిమ గలా దేవుడిని స్తుతిస్తూ ఆరాధించారు.ఈస్టర్ ను పురస్కరించుకుని ప్రధాని మోడీ సహా ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…