Telangana

భవన నిర్మాణంలో భూకంపాలను తట్టుకునే పరిజ్జానం

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఎన్ఐటీ పూర్వ డీన్ ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భూకంపాలను తట్టుకునేలా భవనాలను రూపొందించేందుకు అత్యాధునిక పరిజ్జానం, వినూత్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయని ఎన్ఐటీ సూరత్కల్ మాజీ డీన్ (విద్య) ప్రొఫెసర్ కట్టా వెంకటరమణ చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఇంజనీరింగ్ భూకంప శాస్త్రం – గత భూకంపాల నుంచి నేర్చుకోవడం’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.భూకంప నిరోధక భవన నిర్మాణ డిజైన్ కోసం బేస్ ఐసోలేషన్ టెక్నిక్, బ్రేసింగ్ సిస్టం వంటి పలు వినూత్న పద్ధతులు ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఎయిర్ బ్యాగ్ విధానంలో, భూకంపం వచ్చినప్పుడు భవనం కొద్దిగా పైకి లేచి, ప్రకంపనలు తగ్గిపోగానే యథాతథ స్థితికి వచ్చే అధునాతన సాంకేతిక పరిజ్జానం కూడా అందుబాటులో ఉందన్నారు. భూకంపాలు సహజంగా టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల సంభవిస్తాయని, సీస్మోగ్రాఫ్ ద్వారా దాని తీవ్రతను కొలుస్తారని చెప్పారు. భూకంప సంఘటనలకు వ్యతిరేకంగా భద్రత, స్థితిస్థాపకతను పెంచడానికి అనుగుణంగా నిర్మాణాలను రూపొందించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

  

స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, నిర్మాణ పద్ధతులు ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా అభివృద్ధి చెందాయని, అయితే అనేక భూకంప ప్రయోగాలు ఖరీదైనవి కావడంతో, అవి సంభవించినప్పుడు వివిధ దేశాల నిపుణులు క్షేత్ర ప్రయోగాల ద్వారా నష్టాన్ని అధ్యయనం చేయడమే గాక, డిజైన్ లోపాలను గుర్తించి, మెరుగైన ఇంజనీరింగ్ పద్ధతులను రూపొందిస్తారని వివరించారు. కుప్పకూలిపోకుండా ఊగగల, శక్తిని గ్రహించగల నిర్మాణాలను రూపొందించడం చాలా అవసరమని డాక్టర్ కట్టా స్పష్టీకరించారు. వంగే గుణము, ఉపబలం సూత్రాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, ప్రకృతి శక్తులను తట్టుకునే భవనాలను మనం సృష్టించవచ్చని, అందులో నివాసం ఉండేవారికి తగిన భద్రత కల్పించవచ్చని అన్నారు.

కాన్పూర్ ఐఐటీ వెబ్ సైట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ (ఎన్ఐసీఈఈ) వంటి వాటిని తరచూ సంప్రదించడం ద్వారా పలు ప్రాజెక్టులు, పరిశోధనలు చేపట్టే వీలుందంటూ ప్రొఫెసర్ వెంకటరమణ విద్యార్థులను ప్రోత్సహించారు. వారడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చేపూరి అఖిలేష్ అతిథిని విద్యార్థులకు పరిచయం చేసి, ఆయన విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్జతలు తెలియజేశారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago