Telangana

తాగి మరియు ఫోను మాట్లాడుతూ వాహనాలు నడపరాదు_ పటాన్ చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

పటాన్ చెరు  డిసిఎం డ్రైవర్ల సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తాగడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని, కచ్చితంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్ చెరు డిసిఎం వర్కర్స్ యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో జరిగిన పట్టణ డీసీఎం డ్రైవర్ల సమావేశం లో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు డ్రైవర్లు మద్యం తాగి మరియు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది జీవితాలు కోల్పోతున్నారని, అలాగే అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయనేది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని, అలా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించచ్చని ఆయన అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, అలాగే వాహనాల ఇన్సూరెన్స్ ఇతర ఫిట్నెస్ సకాలంలో పూర్తి చేయించుకుంటేనే అందరికీ మంచిదన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య మాట్లాడుతూ ట్రాన్స్ పోర్టు కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు ట్రాన్స్ పోర్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. వెల్ ఫేర్ బోర్డు లేకపోవడం ద్వారా ప్రమాదాలు జరిగిన రవాణా రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ పోషణ ఇబ్బందు అవుతుందని వాపోయారు. ఈఎస్ఐ,పిఎఫ్, పెన్షన్, ప్రమాద బీమా వంటివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. దేశ ఉత్పత్తిలో రవాణా రంగం చాలా కీలకమైందని, డీసీఎంలకు స్థలాల సమస్య లేకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు డీసీఎం డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రెటరీ కృష్ణ లు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, సంఘం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడి హక్కులు సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ గుర్తింపు కార్డులను డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆసిఫ్, మరియు డిసిఎం యూనియన్ నాయకులు ఋషి, అతిక్, జనార్దన్ రెడ్డి తదితర డ్రైవర్లు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ

అంతకుముందు యూనియన్ జెండాను సిఐటియు సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కార్మిక వర్గానికి ఐక్యతే మహాబలమని, కార్మికులందరూ సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago