Telangana

తాగి మరియు ఫోను మాట్లాడుతూ వాహనాలు నడపరాదు_ పటాన్ చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

పటాన్ చెరు  డిసిఎం డ్రైవర్ల సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తాగడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని, కచ్చితంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్ చెరు డిసిఎం వర్కర్స్ యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో జరిగిన పట్టణ డీసీఎం డ్రైవర్ల సమావేశం లో పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతు డ్రైవర్లు మద్యం తాగి మరియు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలా చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని అనేకమంది జీవితాలు కోల్పోతున్నారని, అలాగే అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయనేది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని సూచించారు. అలాగే వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలని, అలా పాటించినప్పుడే ప్రమాదాలను నివారించచ్చని ఆయన అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపరాదని, అలాగే వాహనాల ఇన్సూరెన్స్ ఇతర ఫిట్నెస్ సకాలంలో పూర్తి చేయించుకుంటేనే అందరికీ మంచిదన్నారు.సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య మాట్లాడుతూ ట్రాన్స్ పోర్టు కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు ట్రాన్స్ పోర్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. వెల్ ఫేర్ బోర్డు లేకపోవడం ద్వారా ప్రమాదాలు జరిగిన రవాణా రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ పోషణ ఇబ్బందు అవుతుందని వాపోయారు. ఈఎస్ఐ,పిఎఫ్, పెన్షన్, ప్రమాద బీమా వంటివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. దేశ ఉత్పత్తిలో రవాణా రంగం చాలా కీలకమైందని, డీసీఎంలకు స్థలాల సమస్య లేకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాజిద్ అలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు డీసీఎం డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రెటరీ కృష్ణ లు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, సంఘం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాడి హక్కులు సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా యూనియన్ గుర్తింపు కార్డులను డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆసిఫ్, మరియు డిసిఎం యూనియన్ నాయకులు ఋషి, అతిక్, జనార్దన్ రెడ్డి తదితర డ్రైవర్లు పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణ

అంతకుముందు యూనియన్ జెండాను సిఐటియు సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కార్మిక వర్గానికి ఐక్యతే మహాబలమని, కార్మికులందరూ సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago