Hyderabad

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది

మియపూర్

డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయ వాది అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ x రోడ్, మియపూర్ బిజెపి కార్యాలయం వద్ద జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం కార్యాలయం వద్ద చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నిష్ణాతుడైన న్యాయవాది, తత్వవేత్త, గొప్ప పేరున్న విద్యావేత్త అని అన్నారు.అతను కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క అతి పిన్న వయస్కుడైన ఛాన్సలర్ గా ,స్వతంత్ర భారతదేశపు మొదటి పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా దేశానికి సేవ చేశాడు గుర్తుచేశారు.జాతీయ ఐక్యతను కాపాడటానికి , జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా ఏకీకృతం చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు అని అన్నారు. మాతృభూమిపై ఆయనకున్న ప్రేమ ప్రతి భారతీయుడికి ఎప్పుడూ ప్రేరణగా ఉంటుందన్నారు.

కాశ్మీర్ విషయంలో ఆయన కన్న కలల్ని ఇవాళ భారత ప్రధాని మోదీ నిజం చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు.తదనంతరం జాతీయ పార్టీ పిలుపు మేరకు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా జన ప్రియ నగర్, హఫీజ్ పెట్, ప్రజసిటీ,ఆల్విన్ కాలనీ, సప్తగిరి కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కోటేశ్వరరావు,వర ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల లక్ష్మణ్, పాపయ్య,రాజా రత్నం,పృథ్వి కాంత్, బాబు, అంజయ్య,యాదగిరి,నర్సింహ,జానీ,శ్రీకర్, లక్ష్మ రెడ్డి, రమణరావు, రవీందర్, కొండ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago