మనవార్తలు , పటాన్ చెరు:
భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సాబాదా సాయి కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు.అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత అని బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడుని స్మరించుకుంటూ జై భీమ్ నినాదాలు మారుమోగాయి. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి కుల, మత, వర్ణ, వర్గ రహిత సమాజం కోసం అహర్ణిశలు కృషి చేసిన మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగాన్ని క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి అన్నదానం మరియు అంబేద్కర్ శోభయాత్ర కు గాని మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ గారికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్అర్ పిఎస్ ,ఎమ్ఇఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ముక్క గళ్ళ ఆంజనేయులు ,బీఎస్పీ సెక్టార్ ఇంచార్జి సాబాదా శ్రీనివాస్,రాష్ట్రీయ దళిత సేన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్,సంఘం అధ్యక్షులు, మహేష్ మాజీ వార్డు మెంబర్ పోట్లచెరువు ప్రభు ఎర్రోళ్ల ప్రభు, పెద్దబోదుల నర్సింలు, గడ్డమీది కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…