Districts

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలు నేటి తరానికి దిక్సూచి: సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సాబాదా సాయి కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు.అంబేద్కర్ అంటే ఒక వర్గానికి పరిమితం కాదని, అన్ని వర్గాలకు స్ఫూర్తి ప్రదాత  అని బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడుని స్మరించుకుంటూ జై భీమ్ నినాదాలు మారుమోగాయి. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి కుల, మత, వర్ణ, వర్గ రహిత సమాజం కోసం అహర్ణిశలు కృషి చేసిన మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ సమాజంలో ఎలా నడుచుకోవాలో, రాజ్యాంగాన్ని క్లుప్తంగా రచించి ప్రజలకు అందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి అన్నదానం మరియు అంబేద్కర్ శోభయాత్ర కు గాని మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ గారికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఎమ్అర్ పిఎస్ ,ఎమ్ఇఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ముక్క గళ్ళ ఆంజనేయులు ,బీఎస్పీ సెక్టార్ ఇంచార్జి సాబాదా శ్రీనివాస్,రాష్ట్రీయ దళిత సేన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్,సంఘం అధ్యక్షులు, మహేష్ మాజీ వార్డు మెంబర్ పోట్లచెరువు ప్రభు ఎర్రోళ్ల ప్రభు, పెద్దబోదుల నర్సింలు, గడ్డమీది కుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago