రోగ్య సంరక్షణలో కృత్రిమమేథ కీలకభూమిక..
పటాన్ చెరు:
ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథ ( ఏఐ ) కీలక భూమిక పోషిస్తోందని బ్రిటన్కు చెందిన డాక్టర్ అకినో ఏఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జ్ఞానేశ్వర్ జాదవ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ మంగళవారం ఏర్పాటుచేసిన ఆతిథ్య ( వర్చువల్ ) ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , భవిష్యత్తులో కృత్రిమ మేథ ద్వారా మెరుగైన వైద్యం , చికిత్సా విధానాలతో రోగి ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చన్నారు . అంతేకాక , వెద్యులకు కీలకమైన ఔషధపరమైన అంతర్దృష్టిని అందించడానికి , సురక్షితమైన , సులువుగా బదిలీ చేయగల వైద్య చరిత్రను నిర్ధారించడానికి సాంకేతికత ఆధారిత వేదికను అందించగల వివిధ మార్గాలను ఆయన వివరించారు .
విభిన్న సంస్కృతులు , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మధ్య అంతరాన్ని తగ్గించడానికి , సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించడంలో కూడా కృత్రిమ మేథ తోడ్పడుతుందన్నారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తగిన వివరణలిచ్చి ఆకట్టుకున్నారు . తొలుత , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ అతిథిని స్వాగతించగా , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ బారిక్ పరిచయం చేశారు . దాదాపు 200 మంది విద్యార్థులు , అధ్యాపకులు , పరిశోధక విద్యార్థులు ఈ ఆతిథ్య ఉపన్యాసంలో పాల్గొన్నారు .
గీతమ్ గంగోత్సవ్…
గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా నవంబర్ 1 నుంచి 3 వ తేదీ వరకు గంగా ఉత్సవ్ను జరుపుకుంటారు . అందులో భాగంగా , గీతం ఎన్సీసీ విద్యార్థులు మంగళవారం ఈ ఉత్సవాన్ని నిర్వహించడంతో పాటు సామాన్య ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు . గంగా నది పునరుజ్జీవనంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యంగా వారు పేర్కొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…