politics

అవ‌య‌వ‌దానం చేసి…మ‌రోసారి జీవించ‌డం – రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య

_రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్

_ప్ర‌వీణ్ కు చెందిన రెండు కిడ్నీలు, లివ‌ర్ ను దానం చేసిన కుటుంబ స‌భ్యులు

_చ‌నిపోయిన త‌ర్వాత జీవించే అవ‌కాశం ఒక్క అవ‌య‌వ‌దానం ద్వారానే క‌లుగుతుంది – సుధీర్ రెడ్డి

మనవార్తలు ,రుద్రారం:

మనిషి చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుందని రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మనిషి బతికి వున్నప్పుడే కాదు ,చనిపోయినప్పుడు తర్వాత అవయవాలు దానం చేసి మరికొందరు జీవితాల్లో వెలుగు నింపవ‌చ్చ‌ని ఆయ‌న‌ తెలిపారు. అవ‌య‌వ‌దానానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమ‌న్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్ద‌బోతుల ప్ర‌వీణ్ ఇటీవల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళాడు. వెంట‌నే హైద‌రాబాద్ నాన‌క్ రాం గూడ‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యుల బృందం బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. ఈ విష‌యం తెలుసుకున్న జీవ‌న్ ధాన్ బృందం ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి అవ‌య‌వ‌దానం చేసేందుకు ఒప్పించారు. దీంతో వెంట‌నే ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యులు అవ‌య‌వదానం చేసేందుకు అంగీక‌రించారు.

 

దీంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్ రెండు కిడ్నీలు, లివ‌ర్ సేక‌రించి మరో ముగ్గురికి ప్రాణ‌దానం చేశారు. మ‌న దేశంలో అవ‌య‌వ‌దానంపై అనేక అపోహ‌లు ఉన్నాయ‌ని..మూడ‌న‌మ్మ‌కాల‌తో అవ‌య‌వ‌దానం చేసేందుకు ముందుకు రావ‌డంలేద‌ని ప్ర‌వీణ్ తండ్రి తెలిపారు . దానాల్లో అన్న‌దానం గొప్ప‌ద‌ని పూర్వం అనేవార‌ని..కానీ ఇప్పుడు అన్ని దానాల కంటే ప్రాణ‌దానం గొప్ప‌ది .ప్రాణ‌దానానికి దోహ‌ద‌ప‌డే అవయవదానం మ‌రింత గొప్ప‌ది. అవయవదాన ప్రాధాన్యంపై కొన్ని అపోహలూ ఉన్నాయ‌ని.. వాటిని తొల‌గించుకోవాల్సిన అస‌వ‌రం ఎంతైనా ఉంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ హరి ప్రసాద్ రెడ్డి ,వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ ,రాజిరెడ్డి, మరియు అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్, రెడ్డి ,కంచరి శ్రీనివాస్, ఎల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య భాస్కర్ గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago