politics

అవ‌య‌వ‌దానం చేసి…మ‌రోసారి జీవించ‌డం – రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య

_రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్

_ప్ర‌వీణ్ కు చెందిన రెండు కిడ్నీలు, లివ‌ర్ ను దానం చేసిన కుటుంబ స‌భ్యులు

_చ‌నిపోయిన త‌ర్వాత జీవించే అవ‌కాశం ఒక్క అవ‌య‌వ‌దానం ద్వారానే క‌లుగుతుంది – సుధీర్ రెడ్డి

మనవార్తలు ,రుద్రారం:

మనిషి చనిపోయిన తర్వాత జీవించే అవకాశం ఒక్క అవయవదానం ద్వారానే కలుగుతుందని రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య అన్నారు. దేశంలో ఏటా ఐదు లక్షల మంది అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మనిషి బతికి వున్నప్పుడే కాదు ,చనిపోయినప్పుడు తర్వాత అవయవాలు దానం చేసి మరికొందరు జీవితాల్లో వెలుగు నింపవ‌చ్చ‌ని ఆయ‌న‌ తెలిపారు. అవ‌య‌వ‌దానానికి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమ‌న్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్ద‌బోతుల ప్ర‌వీణ్ ఇటీవల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళాడు. వెంట‌నే హైద‌రాబాద్ నాన‌క్ రాం గూడ‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యుల బృందం బ్రెయిన్ డెడ్ గా గుర్తించారు. ఈ విష‌యం తెలుసుకున్న జీవ‌న్ ధాన్ బృందం ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి అవ‌య‌వ‌దానం చేసేందుకు ఒప్పించారు. దీంతో వెంట‌నే ప్ర‌వీణ్ కుటుంబ స‌భ్యులు అవ‌య‌వదానం చేసేందుకు అంగీక‌రించారు.

 

దీంతో బ్రెయిన్ డెడ్ అయిన ప్ర‌వీణ్ రెండు కిడ్నీలు, లివ‌ర్ సేక‌రించి మరో ముగ్గురికి ప్రాణ‌దానం చేశారు. మ‌న దేశంలో అవ‌య‌వ‌దానంపై అనేక అపోహ‌లు ఉన్నాయ‌ని..మూడ‌న‌మ్మ‌కాల‌తో అవ‌య‌వ‌దానం చేసేందుకు ముందుకు రావ‌డంలేద‌ని ప్ర‌వీణ్ తండ్రి తెలిపారు . దానాల్లో అన్న‌దానం గొప్ప‌ద‌ని పూర్వం అనేవార‌ని..కానీ ఇప్పుడు అన్ని దానాల కంటే ప్రాణ‌దానం గొప్ప‌ది .ప్రాణ‌దానానికి దోహ‌ద‌ప‌డే అవయవదానం మ‌రింత గొప్ప‌ది. అవయవదాన ప్రాధాన్యంపై కొన్ని అపోహలూ ఉన్నాయ‌ని.. వాటిని తొల‌గించుకోవాల్సిన అస‌వ‌రం ఎంతైనా ఉంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ హరి ప్రసాద్ రెడ్డి ,వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, శ్రీనివాస్ ,రాజిరెడ్డి, మరియు అమరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్, రెడ్డి ,కంచరి శ్రీనివాస్, ఎల్లయ్య, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య భాస్కర్ గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago