Telangana

పటాన్చెరులో ఘనంగా జిల్లా స్థాయి 67వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభం

_విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన విద్యార్థులతో నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ను స్వీకరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రభుత్వం ప్రతి ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని 7 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంతో వివిధ మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

వివిధ క్రీడ అంశాల్లో ప్రతిభ చూపుతున్న క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశనుండే క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రుల సైతం సంపూర్ణ ప్రోత్సాహం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ అమూల్య, సీఐ లాలూ నాయక్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago