Telangana

ప్రభుత్వ పాఠశాలల్లో స్టేషనరీ కిట్ల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

తన నిరంతర దాతృత్వ కార్యక్రమాలు, సమాజాభివృద్ధికి నిబద్ధతలో భాగంగా, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల రుద్రారంలోని ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత స్టేషనరీ కిట్లను పంపిణీ చేసింది.గీతం విద్యార్థులు ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల అభ్యాసకుల విద్యా ప్రయాణానికి మద్దతు ఇవ్వడం, విద్యపై వారి ఆసక్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా విద్యార్థులు వారికి అవసరమైన స్టేషనరీ సెట్లతో పాటు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ మార్గదర్శనం, పర్యవేక్షణలో 2013 నుంచి సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత స్టేషనరీ కిట్లు, ఇతరత్రా విద్యా సహాయం చేస్తున్నారు.ఈ కిట్లను అందుకున్న పాఠశాల బాలలు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తూ, ఫోటోలకు పోజులిచ్చారు. గీతం, అందులోని విద్యార్థులు ప్రదర్శించిన దాతృత్వం, సామాజిక బాధ్యతను ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అభినందించారు.వీడీసీ కోచ్ పార్థసారథి, ఇతర విద్యార్థి వాలంటీర్లతో కలిసి ఈ పంపిణీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా, తన చుట్టుపక్కల సమాజాలలో విద్యను పెంపొందించడానికి, బాలల మనస్సులను శక్తివంతం చేయడానికి గీతం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూనే ఉంది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago