మనవార్తలు ,బొల్లారం:
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో అందించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసి ప్రభుత్వానికి సకాలంలో నివేదికలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు .ముఖ్యమంత్రి ఆశా వర్కర్లను పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్షంగా ,ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు మీరు ,కరోనా సమయంలో మీరు చేసిన సేవలు ,ఫివర్ సెర్వేలో కూడా మీ సేవలు మరువలేవివని,కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు.ఈకార్యక్రమంలో డాక్టర్. రాధిక,సిహెఓ పీహెచ్ఎన్ స్వరూప మరియు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…