Telangana

ప‌టాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

_పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర స్ఫూర్తితో ప్రారంభమైన స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్విసప్తాహ సంబరాలు

_విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

ప‌టాన్ చెరు/అమీన్పూర్/రామచంద్రాపురం/జిన్నారం/గుమ్మడిదల

అఖండ భారతావనికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప‌టాన్ చెరు నియోజకవర్గంలోని పల్లె నుండి పట్నం వరకు స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల ద్వి సప్తాహ సంబరాలను ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంతో ప్రారంభించామని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సంబరాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం ప‌టాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు డివిజన్, ప‌టాన్ చెరు మండలం, జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతి నగర్, జిన్నారం, గుమ్మడిదలలో ఏర్పాటుచేసిన ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాలు పంపిణీ చేశారు. ప‌టాన్ చెరు పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ సినిమా ప్రదర్శనను వీక్షించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోట్ల మంది త్యాగాలు, పోరాటాలతో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన భారతావని చరిత్రను నేటి తరాలకు తెలియజేశాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెండు వారాలపాటు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రతి ఇంటికి జెండాల పంపిణీ, గాంధీ సినిమా ప్రదర్శన, వజ్రోత్సవ ర్యాలీలు, సంస్కృతిక సారథి కళాకారులచే ప్రత్యేక జానపద కళా ప్రదర్శనలు, సామూహిక జాతీయ గీతాలాపన, రక్తదాన శిబిరాలు, క్రీడా పోటీలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.

 

ప‌టాన్ చెరులో వజ్రోత్సవాల పైలాన్..

నియోజకవర్గ కేంద్రమైన ప‌టాన్ చెరులో భవిష్యత్తు తరాలకు చాటి చెప్పేలా ఏరియా ఆసుపత్రి అవరణలో జాతీయ రహదారి పక్కన ఫ్రీడమ్ పార్క్ తో, వజ్రోత్సవాల పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. దీంతోపాటు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ఆయన కోరారు.వజ్రోత్సవాల సంబరాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, రవీందర్ గౌడ్, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అఫ్జల్, పాండు, రాజేష్, ఈర్ల రాజు, షేక్ హుస్సేన్, పరమేష్, పృథ్వీరాజ్, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago