పటాన్చెరు
నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్న డయాగ్నొస్టిక్ సేవలు ఉచితంగా అందించేందుకు పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, కిష్ట రెడ్డి పేట సర్పంచ్ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రారెడ్డి, విజయకుమార్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండలం అధ్యక్షులు పాండు, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు,
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…