Telangana

ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

_సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సుసాధ్యం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రాత్రి జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన అభినందన సభకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల కాలంలో డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను బ్రోచర్ రూపంలో విడుదల చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భారతి నగర్, రామచంద్రపురం, పటాన్చెరు డివిజన్లలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

ఒకనాడు కాలుష్యానికి చిరునామాగా పేరొందిన పటాన్చెరు నేడు అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సహాయ సహకారాలతో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని అన్నారు.ప్రజలు అందిస్తున్న ప్రోత్సాహంతో రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డివిజన్ల అభివృద్ధికి అనునిత్యం అహర్నిశలు కృషి చేస్తున్న కార్పోరేటర్లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

14 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago