Telangana

సమిష్టి సహకారంతో గ్రామాల అభివృద్ధి

_రుద్రారం లో ఒక కోటి 76 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_అతి త్వరలో 10 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనుల శంకుస్థాపన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఒక కోటి 76 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనం, అంబేద్కర్ యువజన సంఘం, బుడగ జంగాల సంక్షేమ సంఘం భవనాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సహకారంతో గ్రామ పంచాయతీల భవనాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.అతి త్వరలో రుద్రారం గ్రామంలో లాటిక్రేట్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు.గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దామని, రాబోయే రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రుద్రారంలో నూతన భవనాల నిర్మాణాలకు ఒక కోటి 16 లక్షల రూపాయలు కేటాయించిన ఎం ఎస్ ఎన్ పరిశ్రమకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నె రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డిఇ సురేష్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago